కరోనాతో వ్యక్తి మృతి

Published: Wednesday May 05, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని అరూర్ గ్రామానికి చెందిన ఒక కిడ్ని సంబంధిత వ్యాధి పేషేంట్ ను 4 రోజుల క్రితం నార్కటపెళ్లి లోని కామినేని ఆసుపత్రికి తరలించి వైద్యం నిర్వహిస్తుండగా అతని శరీరం చికిత్సకు సహకరించకవడంతో వారు అనుమానంతో  కరోనా పరీక్షలు నిర్వహించగా అతనికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయిందని సోమవారం రాత్రి అతనిని స్వగ్రామానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.