రిటైర్మెంట్ కార్మికులకు సన్మానం

Published: Thursday July 01, 2021

బెల్లంపల్లి, జూన్ 30, ప్రజాపాలన ప్రతినిధి : గత కొన్ని దశాబ్దాలుగా సింగరేణి సంస్థలో పనిచేస్తూ శాంతి ఖని గనిపై బుధవారం నాడు పదవి విరమణ పొందిన కార్మికులను సహచర ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు ఘనంగా సన్మానించి సత్కరించారు. బుధవారం నాడు శాంతి గని పైన పదవి విరమణ పొందుతున్న హెచ్ వో పి సునార్కర్ లక్ష్మణ్, టెండాల్ లింగాల రాజేశం, బందెల రాములు, ఆపరేటర్ కుంభాల దుర్గయ్య, జనరల్ మజ్దూర్ కేశవరావులను ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు నాగ వర్ధన్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి కి పదవి విరమణ అనేది తప్పదని పదవీ విరమణ అనంతరం కార్మికులు అధైర్య పడకుండా మనో నిబ్బరంతో కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలని అప్పుడే మనిషి  పదికాలాలపాటు ఆరోగ్యంగా ఉంటారని అందుకు ముందుగానే తగిన ఏర్పాట్లు చేసుకుని ప్రశాంత జీవనం గడపాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ గౌరవాధ్యక్షుడు నాగ వర్ధన్, ఇంజనీర్ రాంప్రసాద్ అధ్యక్షుడు రాములు, ట్రెజరర్ అశోక్, రమేష్, ఫోర్ మెన్ రాజలింగు, కార్యదర్శి రాజనాల రమేష్, చిలుక రాజనర్సు, రాజ్ కుమార్, రవి నాయక్, నాగరాజు, రవి కిరణ్, భాస్కర్, లక్ష్మణ్, తదితర కార్మికులు పాల్గొన్నారు.