అన్ని దానాల కన్నా నీటి దానం అదృష్టం - విప్ గాంధీ

Published: Wednesday April 13, 2022
హైదరాబాద్ మార్చి 12 వెలుగు జ్యోతి శేరిలింగంపల్లి న్యూస్: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి లోని రంగనాథ స్వామి దేవాలయం ఎదురుగా తెరాస నాయకులు చంద్రమౌళి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రంను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఈ  సందర్బంగా మాట్లాడుతూ.. నగరంలో రోజు రోజుకూ ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ప్రజలు ఎండలకు నీళ్లకు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఈ చలివేంద్రం దాహార్తిని తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని బాటసారులు, వాహనదారుల దాహాన్ని తీరుస్తాయి అని, ప్రజలందరూ ఉపయోగించుకోవాలని. చలి వేంద్రాలు ఏర్పాటు చేయడం మంచికార్యక్రమం అని వేసవికాలంలో ప్రజల దాహాన్ని తీర్చడం గొప్ప విషయం అని, అన్ని దానల కన్నా నీటి దానం చాల  గొప్పదని పేర్కొనడం జరిగినది .వేసవి కాలంలో చలి వేంద్రం ఏర్పాటు చేసిన నిర్వాహకులు చంద్రమౌళిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గాంధీ అభినదించడం జరిగినది. అందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి చలి వేంద్రలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ తెరాస అధ్యక్షులు రాజు నాయక్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, సురేందర్, ఎల్లేష్, రామ స్వామి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.