అభివృద్ధి పనులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే సంజయ్ జడ్పీ చైర్పర్సన్ వసంత శంకుస్థాపన
Published: Saturday February 25, 2023
సారంగాపూర్, ఫిబ్రవరి 24 (ప్రజపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ కొనపూర్ గ్రామంలో 5 కోట్ల 65 లక్షలతో హైలెవల్ వంతెన బ్రిడ్జ్ నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత లైబ్రరీ చైర్మన్ డా: చంద్రశేఖర్ గౌడ్ భూమి పూజ చేశారు. అనంతరం 30 లక్షలతో మనఊరు మనబడి కారేక్రమంలో భాగంగా నిర్మించిన అభివృద్ది పనులను మరియు 86 లక్షలతో శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో రాజగోపురం నిర్మాణానికి ఎమ్మెల్యే జెడ్పీ చైర్పర్సన్ లైబ్రరీ చైర్మన్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొల జమునశ్రీనివాస్ జెడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్ సర్పంచుల ఫోరం గుర్రాల రాజేందర్ రెడ్డి పాక్స్ ఛైర్మెన్లు మల్లారెడ్డి ఏలేటి నరసింహరెడ్డి వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్ ఎంఈవో భీమయ్యా
సర్పంచులు ఆకుల జమున బొడ్డుపల్లి రాజన్న రమేష్
ఆలయ ట్రస్ట్ ఛైర్మెన్ పోరండ్ల శంకరయ్య ఈవో కాంతారెడ్డి ధర్మకర్తలు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు నాయకులు కార్యకర్తలు అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: