చిరంజీవి జన్మదిన వేడుకలు నిర్వించిన చందనగర చిరంజీవి ఫ్యాన్సు
Published: Tuesday August 24, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : చందానగర్ డివిజన్ పరిధిలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆదివారం గండంమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కలు నాటే కార్యక్రమం మరియు కెక్ కట్టింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో గొప్పవని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు సేవా దృక్పధాన్ని అలవర్చుకోవాలని ఆయన కోరారు. యువత సామాజిక కార్యక్రమాలలో పాల్గొని, ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందన్నారు. యువత ముందుకు వచ్చి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ.త్రినాథ్, సత్తి బాబు, జి. కృష్ణ,టీ. కృష్ణ, శ్రీహర్ష, శ్రీరామ్, శ్రీనివాస్ సంజయ్, గుణ, అభి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ చిరంజీవి ఫ్యాన్స్ చందనగర్ వారు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసారు.
Share this on your social network: