బీరుపూర్ తహశీల్దార్ కు బీజేపీ నాయకులు వినతిపత్రం
Published: Wednesday February 17, 2021
బీరుపూర్, ఫిబ్రవరి 16 (ప్రజాపాలన): బీరుపూర్ బీజేపీ మండల అధ్యక్షుడు సిపతి రమేష్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిరసన వ్యక్తం చేశారు. రైతులకు వెంటనే రుణమాపి చేసి ఉచితంగా ఎరువులు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ అరిపుద్దీన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బైరవేని సత్తయ్య కోట కిషన్ కంది రమేష్ కందుకూరి లక్ష్మణ్ మార్కండేయ నారపాక ప్రభాకర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: