ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Published: Friday January 27, 2023

మేడిపల్లి, జనవరి 26 (ప్రజాపాలన ప్రతినిధి)

74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పార్థసారథి పాల్గొని ప్రెస్ క్లబ్ సభ్యులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతుల వెంకట్రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి కూకుట్ల నరోత్తం రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు వేముల తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షులు మాదిరాజు సురేష్ కుమార్, ఏవీ శ్రీధర్ రావు, పారెల్లి సాగర్, కోశాధికారి             రెడ్డిమల్ల యాదగిరి గౌడ్, సంయుక్త కార్యదర్శి దాసరాజు, సలహాదారులు పల్లా మహేందర్ రెడ్డి, మండువ శ్రీశైలం, కోడికంటి శ్రీనివాస్, వడ్డేపల్లి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.