తల్లాడలో బోనాల జాతర ..

Published: Friday October 07, 2022
తల్లాడ, అక్టోబర్ 6 (ప్రజా పాలన న్యూస్):
 తల్లాడ పట్టణంలోని శ్రీ కోట మైసమ్మ తల్లి దేవాలయం వద్ద గురువారం బోనాల జాతర ప్రారంభమైంది. ఆలయ కమిటీ చైర్మన్ లగడపాటి నెహ్రూ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. మహిళలు నూతన వస్త్రాలు ధరించి బోనాలు ఎత్తుకొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ లగడపాటి నెహ్రూ నాయకులు దగ్గుల శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, అప్పిరెడ్డి స్థానికులు అధిక సంఖ్యలు పాల్గొన్నారు.
 
 
 
Attachments area