కల్లూరు లో రెండవ దశ జ్వర పిడితుల ఇంటింటా సర్వే

Published: Monday May 24, 2021
కోరుట్ల, మే 23, (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల మండలం కల్లూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ వనతడుపుల అంజయ్య ఆధ్వర్యంలో రెండవ దశ జ్వర పీడితుల సర్వే చేయడం జరిగింది. ప్రతి ఇంటి ఇంటికి వెళుతూ వారి యొక్క కుటుంబ సభ్యుల బాగోగులు జ్వరానికి సంబదించిన వివరాలు మరియు కరోనా వ్యాధికి సంబంధించి ఎలాంటి సింటమ్స్ ఉన్న చెప్పగలరని ప్రతి ఇంటి గృహ యజమానులను అడిగి తెలుసుకోవడం జరిగిందని సర్పంచ్ తెలియజేశారు. ఈ కార్యక్రమం లో రెండవ వార్డ్ మెంబర్ బి.లక్ష్మి, అంగన్వాడి సంధ్య, కార్యదర్శి ప్రశాంత్, కరోబర్ ప్రమోద్, గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.