*అయ్యప్ప స్వామి ఆలయంలో ముగిసిన మండల పూజలు*

Published: Wednesday December 28, 2022

మధిరడిసెంబర్ 27 ( ప్రజాపాలన ప్రతినిధి) పట్టణంలోని అయ్యప్ప నగర్లో ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప స్వామి దేవాలయంలో 15 మండల పూజలు  63 రోజులపాటు మాలాదారులకు నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. మండల పూజలు ముగింపు సందర్భముగా ప్రతిరోజు ఆలయంలో శివేలి పూజలు నిర్వహించిన భక్తులకు మాలాదారులకు అన్నదానం చేసిన దాతలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఆలయంలో నిరంతరం సేవ చేసిన వారికి సేవ పురస్కారం అందజేశారు. ఈ సేవా పురస్కారం కార్యక్రమంలో సుమారు 350 మంది  సేవకులకు పాల్గొని సేవా పురస్కారాలను అందుకున్నారు. కార్యక్రమంలో స్వామి అయ్యప్ప దేవాలయం నిర్వాహకులు చలవాది శ్రీనివాసరావు చలవాది ధర్మారావు దేవిశెట్టి రంగారావు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావుమైన్నీడి జగన్మోహన్ రావు బత్తుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు