శ్రీలం ఇందిరా కు డాక్టరేట్ ప్రకటించిన కృష్ణ విశ్వవిద్యాల మధిర రూరల్
Published: Tuesday November 15, 2022
నవంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకురాలిగా పనిచేస్తున్న శ్రీమతి శీలం ఇందిర కు కృష్ణా విశ్వవిద్యాలయం సోమవారం డాక్టరేట్ ను ప్రకటించింది. తెలుగు విభాగంలో డాక్టర్ గుమ్మా సాంబశివరావు పర్యవేక్షణలో చావా శివకోటి నవలలు... సమగ్ర పరిశీలన అనే అంశంపై పరిశోధన చేసినందుకు డాక్టరేట్ ను ప్రకటించింది. ఈ పరిశోధనలో చావా శివకోటి గారి 17 నవలలను సమగ్రంగా విశ్లేషించారు. శీలం ఇందిరను కళాశాల ప్రిన్సిపాల్ ఏ ఎల్ ఎన్ శాస్త్రి, మరియు ఇతర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది శుభాకాంక్షలు అభినందించారు.
Share this on your social network: