రెండు బైక్ లు ఢీ : నలుగురికి తీవ్ర గాయాలు
Published: Wednesday June 16, 2021
పరిగి, 15 జూన్, ప్రజాపాలన ప్రతినిధి : రెండు బైకులు ఢీకొన ఘటన దోమ మండల పరిధిలోని మల్లె పల్లి తండా లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దోమ మండల పరిధిలోని మల్లేపల్లి తాండ దగ్గర ఎదురెదురుగా వెళుతూ రెండు బైకులు ఢీ కొన్నాయి. దీనితో నలుగురి కి తీవ్ర గాయాలయ్యాయి. దిర్సoపల్లి గ్రామానికి చెందిన తుంకలి సాయులు తుంకలి అంజిలయ్య అనే ఇద్దరు దాదాపూర్ గ్రామం నుండి దిర్సoపల్లి కి గ్రామానికి తిరిగి వస్తుండగా మల్లేపల్లి గ్రామానికి చెందిన మరో బైక్ ఎదురుగా వస్తూ ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీనితో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మలేపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు పరిస్థితి సీరియస్ గా ఉండటంతో స్థానికులు చికిత్స నిమిత్తం కోస్గి బాలాజీ హాస్పిటల్ కి తరలించారు.
Share this on your social network: