శంకరపట్నంలో అయ్యప్ప శోభయాత్ర. శంకరపట్నం డిసెంబర్ 27 ప్రజా పాలన రిపోర్టర్:
Published: Wednesday December 28, 2022
శంకరపట్నం మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. మంగళవారం శంకరపట్నం మండలం వంకాయ గూడెం గ్రామంలో నీ అయ్యప్ప దేవస్థానం నుండి కొత్తగట్టు శ్రీ మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానం లోని కోనేరులో స్వామి వారికి మంగళ స్నానం నిర్వహించి, అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట అయ్యప్ప స్వామి అన్ని ప్రత్యేక అలంకరణలతో శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో అయ్యప్ప మాలదారులు అంతా భక్తిశ్రద్ధలతో ఆటపాటలతో ముత్యాలు చేస్తూ స్వామివారి ఊరేగింపు అధ్యంతం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు అయ్యప్ప స్వామి దర్శించుకుని పులకించిపోయారు.
Share this on your social network: