ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
Published: Tuesday December 20, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 19 డిసెంబర్ ప్రజాపాలన : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులకు సూచించారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ నిఖిల ప్రజల నుండి వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పెట్టుకున్న అర్జీలను సంబంధిత అధికారులు ప్రాధాన్యమిచ్చి వేను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఈరోజు ప్రజావాణిలో ధరణి,ఆసరా పెన్షన్లు, డబల్ బెడ్ రూమ్ లకు సంబంధించిన 70 దరఖాస్తులను ప్రజల నుండి సేకరించినట్లు కలెక్టర్ తెలిపారు.
Share this on your social network: