రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చిలకా నాగరాజును పరామర్శించిన కృష్ణ మాదిగ
Published: Thursday September 22, 2022
బోనకల్, సెప్టెంబర్ 21 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలోని జానకిపురం గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకా నాగరాజు ఇటువల రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ బుధవారం తన స్వగృహం నందు వచ్చి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కోట హనుమంతరావు మాదిగ, సీనియర్ నాయకులు తాటికొండ వెంకటరత్నం మాదిగ , ఉపాధ్యక్షులు తోటపల్లి సైదులు మాదిగ, ఎం ఎస్ ఎఫ్ మండల అధ్యక్షుడు బొల్లెపోగు రామారావు మాదిగ, మండల అధికార ప్రతినిధి మరికంటి గంగాధర్ రావు, నరసింహారావు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు బచ్చల కూర వెంకటేశ్వర్లు మాదిగ, ఏపూరి వెంకటేశ్వర్లు మాదిగ, అంజి మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ సునీల్ మాదిగ, కూరపాటి ప్రభాకర్ మాదిగ, కనకపుడి శ్రీనివాసరావు మాదిగ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: