నేటి నుండి మే 1వ తేదీ వరకు నీటి సరఫరా ఉండదు

Published: Thursday April 29, 2021
మిషన్ భగీరథ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిరణ్ కుమార్
వికారాబాద్ ఏప్రిల్ 28 ప్రజా పాలన బ్యూరో : ఎల్లూరి, గౌరీదేవిపల్లి మధ్యన మిషన్ భగీరథ ఎంఎస్ మెయిన్ పైప్ లైన్ లీకేజీ మరమ్మతులు జరుగుచున్నవని మిషన్ భగీరథ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిరణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 29 గురువారం నుండి మే ఒకటి శనివారం వరకు మిషన్ భగీరథ నీటి సరఫరా జరుగదని వివరించారు. వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గ గ్రామాలకు మరియు మున్సిపాలిటీలకు నీటి సరఫరా ఉండదని పేర్కొన్నారు. ప్రజలు మంచి నీటిని ముందే నిలువ ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.