దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ

Published: Saturday August 20, 2022
హైదరాబాద్ 19 ఆగష్టు ప్రజాపాలన: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ  వేడుకల సందర్భంగా గర్భిణీ స్త్రీలకు వైద్య అధికారి డాక్టర్ కిషోర్ తాల్క ఆద్వర్యంలో 
పండ్లు పంపిణీ చేయడం జరిగింది. 
జనగాం జిల్లా దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 
75వ స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా వైద్య అధికారి డాక్టర్ కిషోర్ తాల్క ఆసుపత్రిలోని గర్భిణీ స్త్రీలకు మరియు పేషెంట్లకు స్వీట్లు మరియు వివిధ రకాల పండ్లను పంపిణీ చేశారు.  
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ భాస్కర్, సీనియర్ అసిస్టెంట్ రాములు, పంచాయతీ కార్యదర్శి వెంకన్న,  స్టాఫ్ నర్స్ సంధ్యారాణి, కవిత, ఫార్మసిస్ట్ సదానందం, హెల్త్ సూపర్ వైజర్ భాగ్యమ్మ, సత్యనారాయణ, ఏఎన్ఎంలు , హెల్త్ అసిస్టెంట్ రామ్మూర్తి  మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
 
 
 
Attachments area