కోటపల్లి మండలానికి సిసి రోడ్ల నిర్మాణానికి 3.7 కోట్లు

Published: Friday February 03, 2023
* అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయించిన ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్
* కోటపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్
వికారాబాద్ బ్యూరో 2 ఫిబ్రవరి ప్రజాపాలన : కోటపల్లి మండలానికి సిసి రోడ్ల నిర్మాణానికి 3.7 కోట్ల నిధులు మంజూరు చేయించిన చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డికి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కు ప్రత్యేక ధన్యవాదాలని  కోటపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్ అన్నారు. గురువారం కోటపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్ ప్రజా పాలన బ్యూరో రిపోర్టర్ తో మాట్లాడుతూ గ్రామానికి 15 నుంచి 20 లక్షల వరకు నిధులు మంజూరు చేశారని స్పష్టం చేశారు. ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఇంత  భారీ మొత్తంలో నిధుల తేలేదని దెప్పిపొడిచారు. కోట్ పల్లి మండల గ్రామాలపై  ప్రత్యేక శ్రద్ధ పెట్టి గ్రామాలు బాగుపడాలనే సంకల్పంతో అనేక వసతులు కల్పించేందుకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించిన నాయకులు చేవెళ్ల ఎంపి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అని  స్పష్టం చేశారు. కోటపల్లి మండలంలోని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కృషిచేసిన ఎంపీ కి ఎమ్మెల్యేకు మండల పార్టీ అధ్యక్షుడు మండల ప్రజలు కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.