కవ్వాల్ అభయారణ్యంలో సఫారీ పునః ప్రారంభం.

Published: Saturday October 15, 2022

జన్నారం, అక్టోబర్ 14, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ టైగర్ రిజర్వ్ అభయారణ్యంలో ఈ నెల  16 నుంచి ఆటవీ సఫారీ పునఃప్రారంభమవుతుందని మండల ఆటవీ ఆధికారి సిరిపురం మాధవరావు తెలిపారు.ఈమేరకు శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఆరన మాట్లాడుతూ కవ్వాల్ అభయారణ్యంలో ఆటవీ ప్రాంతంలో విహార పర్యాటక క్షేత్రాలు, ప్రకృతి రమణీయ గార్డెన్లు, అటవీ జంతువుల పార్క్, సుందరమైన ప్రాంతాలు వున్నాయని అయన వివరించారు. ఈ కవ్వాల్ అభయారణ్యం ప్రకృతి అందాలను తిలకించడానికి అనేక ప్రాంతాలనుంచి, వివిధ రాష్రాల నుంచి పర్యాటకులు ఎక్కువగా తరలి వస్తారని అయన పేర్కొన్నారు.ఐతే ఈ అవకాశం పర్యాటకులు వినియెాగించుకోవాలని అయన తెలిపారు.