యువత శిక్షణ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి.. జిల్లా మేనేజింగ్ డైరెక్టర్ సైదులు..
Published: Friday December 30, 2022
ఖమ్మం, డిసెంబర్ 29 (ప్రజాపాలన న్యూస్):
*తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ ఖమ్మంజిల్లా ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాలను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మేనేజింగ్ డైరెక్టర్ సైదులు సూచించారు. ఖమ్మంలో శిక్షణ కల్పిస్తున్న ఈ అవగాహన సదస్సుకు ఆయన గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి రంగాల్లో ఆర్థికంగా రాణించేందుకు యువతకు ప్రభుత్వం జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్, డయాలసిస్ టెక్నీషియన్, డెంటల్ అసిస్టెంట్, ఫార్మసీ అసిస్టెంట్ కోర్సులపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వీటిని యువత సద్వినియోగం చేసుకొని కుటుంబాలను ఆర్థికంగా ఆభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా అడ్మనిస్ట్రేటివ్ అఫిసర్ సత్య నారాయణ మాట్లాడుతూ ఎవరైనా ఆసక్తిగల యువకులు 9502740360, 9391463834 నెంబర్లను సంప్రదించాలని పిలుపునిచ్చారు.*
Share this on your social network: