ప్రధానమంత్రి క్షేమం కోసం నవాదుర్గాదేవి ఆలయంలో పూజలు నిర్వహించిన బీజేపీ మండల నాయకులు

Published: Tuesday January 11, 2022
బోనకల్, జనవరి 10 ప్రజాపాలన ప్రతినిధి: మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ పై పంజాబ్ రాష్ట్రంలో జరిగిన భౌతిక దాడికి ఖండిస్తూ నరేంద్ర మోడీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మరియు దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందముగా ఉండాలని  బోనకల్ మండల స్థానిక నవాదుర్గాదేవి ఆలయంలో జిల్లా మరియు మండల బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోత్ నాగేశ్వరరావు, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు తాళ్లూరి సురేష్, బీజేపీ మండల అధ్యక్షుడు విరపనేని అప్పారావు, మండల యువ మోర్చా అధ్యక్షుడు కాలసాని పరశురామ్, బిజెపి యువనేత ఎన్నారై బిపి నాయక్, మండల ప్రధాన కార్యదర్శి గంగుల నాగేశ్వరరావు, ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి మరీదు పరశురాముడు తదితరులు పాల్గొన్నారు.