పొనుగోటి శ్రీనివాసరావు మంజుల పెళ్లి రోజు సందర్భంగా కోటిలింగాలలో పూజలు చేసిన పదిరే నారాయణరా

Published: Thursday April 29, 2021

వెల్గటూర్, ఏప్రిల్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : పొనుగోటి శ్రీనివాసరావు మంజుల పెళ్లి రోజును పురస్కరించుకొని వెల్గటూర్ మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కోటిలింగాల పార్వతి కోటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ పదిరె నారాయణ రావు ఆధ్వర్యంలో తె.రా.స అధ్యక్షులు చల్లూరి రామచంద్ర గౌడ్, కార్యదర్శి సింహాచలం జగన్, వెల్గటూర్ గ్రామ శాఖ అధ్యక్షులు గుండ జగదీష్ ప్రముఖ వైద్యులు బి.రామస్వామి తో కలిసి స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజలు వారి గోత్ర నామాలతో  తోఅర్చన తదితర కార్యక్రమాలు బుధవారం రోజు నిర్వహించినారు. సందర్భంగా అర్చకులతో పొనుగోటి శ్రీనివాసరావు మంజుల కుటుంబం క్షేమంగా ఉండాలని ఆశీర్వచనం నాయకులు చేయించారు. అదేవిధంగా రాజరంపల్లి సర్పంచ్ గెల్లు శేఖర్ ఆధ్వర్యంలో గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.