కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశం కోసం గడువు పొడిగింపు.
Published: Thursday July 01, 2021
జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి పి.రవీందర్రెడ్డి
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 30, ప్రజాపాలన : 2021-22 విద్యా సంవత్సరానికి గాను కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశం పొందేందుకు జూలై 10వ తేదీ వరకు గడువు పొడిగించడం జరిగిందని, అర్హులైన వారు ఆన్లైన్లో www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి పి. వీందర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి చదివి జి.పి.ఎన్. 7.0 ఆపై ఫలితాలు సాధించిన ఎన్.టి., ఎన్.టి., ఈ.బి.సి., మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు అర్హులని, ఈ అవకాశాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Share this on your social network: