కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు గుడిసె రుక్మయ్య మృతికి ప్రగాఢ సానుభూతి

Published: Monday October 04, 2021
మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ బ్యూరో 03 అక్టోబర్ ప్రజాపాలన : కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు సీనియర్ నాయకుడు స్వాతంత్ర్య సమరయోధుడు గుడిసె రుక్మయ్య ముదిరాజ్ మృతి పట్ల మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రామయ్యగూడ గ్రామంలోని మృతుని ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబానికి చేదోడు వాదోడుగా అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్ లు మృతుని కుమారుడు గ్రంధాలయ మాజీ చైర్మన్ గుడిసె లక్ష్మణ్ ముదిరాజ్ ను ఓదార్చారు.