బీజేపీని అధికారంలోకి తీసుకు రావాలి

Published: Wednesday June 30, 2021

జన్నారం, జూన్ 29, ప్రజాపాలన ప్రతినిధి : రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి పార్టీని ఆదరించి అధికారంలోకి తీసుకు రావాలని బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కోరారు. మంగళవారం ఆయన మండలంలోని చింతగూడ గ్రామంలో పర్యటించి పలువురుని కలుసుకొన్నారు, రానున్న ఎన్నికలలో ప్రజలు బీజేపీ వెంటే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు, కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటానని బీజేపీని బలోపేతం చేయాలని సూచించారు, ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోలి చందు రమేష్ గౌడ్ చింతగూడ సర్పంచ్ ఆరే శిరీష్ మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు