అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేయాలి. ...జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

Published: Tuesday June 28, 2022
మంచిర్యాల బ్యూరో, జూన్ 27, ప్రజాపాలన:
 
 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ డిమాండ్ చేశారు.  సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో  సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అగ్నిపథ్ వల్ల భారత ఆర్మీ వ్యవస్థ బలహీన పడుతుందన్నారు. అగ్నిపథ్ పథకం అనేది సైనికులను అవమాన పరిచేలా ,యువత భవిష్యత్ నిర్వీర్యం చేసేలా ఉందని మండిపడ్డారు.16 ఏళ్ళు పనిచేసే ఆర్మీలో నాలుగేళ్ల విధానం సరికాదన్నారు. వెంటనే అగ్నిపథ్ ను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.