వైఎస్ఆర్ టిపీలో చేరిన మాజీ ఎంఎల్ఎ సంజీవరావు సతీమణి మధురవేణి

Published: Tuesday August 02, 2022
వికారాబాద్ బ్యూరో 01 ఆగస్టు ప్రజా పాలన : వైఎస్సార్ టిపి వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర జనాదరణ పొందడంతో చేరికల పర్వం తారా స్థాయికి చేరింది. రాబోవు ఎన్నికల్లో విజయదుందుభి మోగించడానికి బూత్ స్థాయిలో కృషి చేస్తున్నది. పార్టీ బలపడడానికి కార్యకర్తలు ముందుండి నడిపిస్తున్నారు. వైయస్ షర్మిల వాగ్దాటికి ప్రజలు మంత్రముగ్ధులవుతున్నారు. వైయస్ షర్మిల పాదయాత్రతో రోజురోజుకు ప్రజలలో వైఎస్సార్ టిపి పై నమ్మకం పెరుగుతున్నది. వైఎస్ షర్మిల టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అరాచకాలను కుటుంబ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజల హృదయాలలో చొచ్చుకుపోయేలా మాట్లాడడం అభినందనీయం. ఆమె పాదయాత్ర ప్రేరణతో వైఎస్సార్ టిపిలో చేరికల పర్వం కొనసాగుతున్నది. సోమవారం మాజీ ఎమ్మెల్యే సంజీవరావు సతీమణి మధురవేణి అంజలీనా రజిని రోహిత జార్జ్ ధారూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి విజేందర్ నాగరాజు పాండు ప్రశాంత్ తదితర కార్యకర్తలు మండల ఇన్చార్జ్ రత్నం ఆధ్వర్యంలో వైఎస్సార్ టిపి కండువా కప్పుకున్నారు. వికారాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ మామిడి సంగమేశ్వర్ మధురవేణికి కండువా కప్పి పూలమాలవేసి పార్టీలోకి ఆహ్వానించారు.
 
 
 
Attachments area