తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమురయ్య - మండల సురేందర్

Published: Tuesday April 04, 2023
జవహార్ నగర్ (ప్రజాపాలన ప్రతినిధి):
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్  మహనీయుల ఉత్సవ కమిటీ అధ్యక్షులు మండల సురేందర్ ఆధ్యర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం,  వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాటం చేసి అమరుడైన తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి 96వ జయంతి సందర్భంగా ఈ వేడుకలను తెలంగాణ ప్రజలంతా చేయాలనీ పిలుపిచ్చారు. మహానీయులను త్యాగాల ఫలితమే మనం అనుభవిస్తున్న ఈ జీవితమని దొడ్డి కొమురయ్య జయంతి ఇలా కుల,  మత పార్టీలకు అతీతంగా జరుపుకోవడం అందండంగా ఉందని అన్నారు. 
ఈ  కార్యక్రమంలో  ఉత్సవ కమిటీ సభ్యులు, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని రాజకీయపార్టీల నాయకులు, కుల, ప్రజా సంఘాల నాయకులు, అధికారులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు, కులమతాలకు అతీతంగా ఈ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. తదనంతరం దళిత భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఉత్సవ కమిటీ కార్యాచరణ, విధివిధానాలు తెలియజేసారు.