మొక్కలు నాటిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు
Published: Wednesday July 07, 2021
మధిర, జులై 06, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పట్టణ ప్రగతి లో భాగంగా రెండో వార్డ్ లో మొక్కలు నాటిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది పల్లెలు పట్టణాలు శుభ్రంగా ఉండాలి అత్యధిక సంఖ్యలో మొక్కలు నాటాలి అధిక వర్షాల రావాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు తీసుకున్నారని దీనికి ప్రజలందరూ రాజకీయాలకతీతంగా ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగీసెట్టి కోటేశ్వరరావు, జిల్లా నాయకులు జయకర్, మండల పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, టిఆర్ఎస్ నాయకులు MD ఖాదర్, ప్రసాద్ తదితర పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.
Share this on your social network: