జిల్లా పోలీస్ పనితీరుపై నెలవారి సమీక్ష సమావేశం ** వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ మహేందర్ రెడ్డ

Published: Wednesday December 28, 2022
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 27 (ప్రజాపాలన,ప్రతినిధి) : 
 
 ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ పనితీరుపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మంగళవారం నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ పాల్గొన్నారు. ప్రధానంగా శాంతి భద్రత గురించి పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ ప్రజలకు భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పోలీస్ అధికారులకు తెలిపారు. నిషేధిత మత్తు పదార్థాల విషయములో ప్రత్యేక దృష్టిపెట్టాలని అన్నారు. స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరించి  సమస్యను త్వరగా పరిష్కరించే దిశగా చూడాలని పేర్కొన్నారు. మహిళలు చిన్నపిల్లలపై అఘాయిత్యానికి  పాల్పడే వారికి చట్ట పరంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీఎస్పీ లు శ్రీనివాస్,కరుణాకర్, టాక్స్ ఫోర్స్ సీఐ సుధాకర్, సీఐ రానా ప్రతాప్,భరత్ భూషణ్, శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.