రేగుంటలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

Published: Thursday June 17, 2021
మల్లాపూర్, జూన్16 (ప్రజాపాలన ప్రతినిధి) : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం అని రేగుంట సర్పంచ్ కుందేళ్ళ నర్సయ్య అన్నారు. స్థానిక నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు బుధవారం మల్లాపూర్ మండలం రేగుంట గ్రామ పంచాయితీ ఆవరణలో గ్రామ సర్పంచ్ నర్సయ్య గ్రామానికి చెందిన అర్హులైన ఇద్దరికి రూ.22,500 విలువ గల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ ఆర్థిక స్థోమత సరిగ్గా లేక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం నమోదు చేసుకున్న అర్హులైన వారందరికీ ముఖ్యమంత్రి చెక్కులు మంజూరు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మండ మల్లారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సురకంటి శ్రీనివాస్ రెడ్డి, రెండవ వార్డ్ మెంబర్ లక్ష్మి, నాయకులు కలుసాని రాజన్న, సురకంటి తిరుపతి రెడ్డి, దండికె శ్రీనివాస్, కుందేళ్ళ నడిపి గంగారం, మూడంపెల్లి శ్రీనివాస్, మహిళలు పాల్గొన్నారు.