కరోనా పట్ల ప్రజలందరూ జాగ్రత్తలు వహించాలి

Published: Saturday January 22, 2022
కార్పొరేటర్ డాక్టర్ సుభాష్ నాయక్
మేడిపల్లి, జనవరి 21 ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా పట్ల ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకుంటూ, ఫీవర్ సర్వేకు ప్రతి ఒక్కరు వైద్య సిబ్బందికి సహకరించాలని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సుభాష్ నాయక్ సూచించారు. ఈ మేరకు డివిజన్లోని కాకతీయనగర్ మార్వెల్ హైట్స్ అపార్ట్మెంట్లో ఇంటింటా కార్పొరేటర్ సుభాష్ నాయక్ వైద్య సిబ్బందితో కలిసి ఫీవర్ సర్వే చేయించారు. ఫీవర్ ఉన్న వాళ్లకు వైద్య సిబ్బంది మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు మరియు కాకతీయ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పి బాలరాజ్, డివిజన్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కాకతీయ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి  జె జహంగీర్, మార్వలెస్ అపార్ట్మెంట్ అధ్యక్షులు సందీప్ మరియు వార్డ్ ఆఫీసర్ గోవింద్, హెల్త్ వర్కర్స్, మున్సిపల్  సిబ్బంది మరియు కాలనీ సభ్యులు పాల్గొన్నారు.