పౌర సన్మానం నాకు మరింత భాద్యతను పెంచింది :పీసీసీ సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్

Published: Monday October 17, 2022
బోనకల్ , అక్టోబర్ 16 ప్రజా పాలన ప్రతినిధి:పౌర సన్మానం చేయటం నాకు మరింత బాధ్యతను పెంచిందని, ఇంకా అభివృద్ధిలో ముందుకు పోవడానికి నాకు రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది అని పీసీసీ సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్ అన్నారు. ఆదివారం బోనకల్ మండలంలోని కలకోట గ్రామములో తెలుగు బాప్టిస్ట్ చర్చిలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంఘస్థులు పూలమాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు .సన్మానం చేసిన సంఘస్తులకు అయన కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ విక్టర్ పాల్, జయపాల్, సదానంద పాల్,అనూష పాల్ సంఘ పెద్దలు యూత్ కమిటీ సభ్యులు,సంఘస్తులు పాల్గొన్నారు.