రైతులు మరణించిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి

Published: Wednesday July 20, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 19 ప్రజాపాలన ప్రతినిధి.ఉప్పరిగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుండి మరణించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సలహా మేరకు ఎల్లవేళలా ఆర్థిక సహాయం అందే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం చూస్తుందని చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి అన్నారు. తాళ్ల ముత్యమయ్య తండ్రి రామచంద్రయ్య, నర్కుడి రాములు తండ్రి సాయిలు వీరి కుటుంబాలకు ప్రభుత్వం సహకార సంఘం ద్వారా ఒక్కొక్కరికి చొప్పున 15000 రూపాయలు తాళ్ల లక్ష్మమ్మకు మరియు నర్కుడి ఆగమ్మకు వ్యవసాయ సహకార సంఘం పాలకమండలి ఆధ్వర్యంలో 30 వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాలకమండలి  వైస్ చైర్మన్ క్యామ శంకరయ్య, ఏదుల పాండురంగారెడ్డి, ఏదుల జంగారెడ్డి, కారింగ్ విశాల, వర్ర్త్య సీతయ్య, బొమ్మన కంటి అశోక్, మేడిపల్లి పుల్లయ్య, కంబాలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, పో రెడ్డి శ్రీనివాస్ రెడ్డి,  నలోల్ల  పోచమ్మ, గుర్రం సుధాకర్ రెడ్డి, సీఈవో బోస్ పెళ్లి గణేష్, గ్రామస్తులు పెద్దలు పాల్గొన్నారు,