కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారుల ఇంటింటికీ వెళ్లి పంపిణి చేసిన ఎమ్మెల్యే, జెడ్పీ చైర్ పర

Published: Wednesday February 02, 2022

జగిత్యాల, ఫిబ్రవరి 01 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల అర్బన్ మండల అంబారీపెట్ గ్రామంలో 5 గురు ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి ద్వారా మంజూరైన 5,00,580 రూపాయల విలువగల చెక్కులను లబ్దిదారుల ఇంటింటికీ వెళ్లి  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత అందజేసినారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేష్, సర్పంచ్ గంగాధర్, ఉప సర్పంచ్ నారాయణ, ఎంపిడిఓ స్వరూప రాణి, ఎంఈఓ గాయత్రి, గ్రామ శాఖ అధ్యక్షులు అది మల్లేష్, నాయకులు శంకరయ్య, గొనెల బక్కన్న, పోషన్న, మల్లయ్య, గంగారెడ్డి, మల్లేష్, పురుషోత్తం, తిరుపతి, హోటల్ తిరుపతి, సుద్దాల రెడ్డి, జలంధర్, స్వామి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.