లక్ష్మీకి నివాళులర్పించిన జడ్పీటీసీ దిరిశాల ప్రమీల..

Published: Friday September 30, 2022
తల్లాడ, సెప్టెంబర్ 29 (ప్రజాపాలన న్యూస్):
టిఆర్ఎస్ పార్టీ తల్లాడ పట్టణ అధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వరరావు (జివిఆర్) మాతృమూర్తి లక్ష్మి ఇటీవల మృతిచెందారు. గురువారం ఆమె  సంస్మరణ సభ తల్లాడలోని స్వగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తల్లాడ జడ్పిటిసి దిరిశాల ప్రమీల హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాప సానుభూతిని తెలిపారు. నివాళులర్పించిన వారిలో టిఆర్ఎస్ పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు రెడ్డెం వీర మోహన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దుగ్గిదేవర వెంకట లాల్, కుర్నవల్లి సొసైటీ చైర్మన్ ఐలూరి ప్రదీప్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దొడ్డ చిన్న శ్రీనివాసరావు, టిఆర్ఎస్ జోనల్ చైర్మన్ దిరిశాల దాసురావు, నాయకులు కొమ్మినేని శ్రీనివాసరావు, రాయల తిరుమలయ్య, సంగసాని శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.