ఉప్పల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Friday January 27, 2023
మేడిపల్లి, జనవరి 26 (ప్రజాపాలన ప్రతినిధి)
74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిధులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొని కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, చేతన హరీష్, ఉప్పల్ డిసి అరుణకుమారి, ఈఈ నాగేందర్, నాయకులు మేకల శివారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, దుబ్బ నరసింహారెడ్డి, పసుల ప్రభాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, మహంకాళి లక్ష్మణ్, పబ్బతి శేఖర్ రెడ్డి, ఆకిటి బాల్ రెడ్డి, అన్య బాలకృష్ణ, విబి నరసింహ తదితరులు పాల్గొన్నారు.