ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు ధ

Published: Saturday April 01, 2023
మేడిపల్లి, మార్చి31 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్
 పనుల్లో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, పనులను వెంటనే పూర్తి చేయాలని, కారిడార్ కారణంగా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్  నియోజకవర్గం ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మందుముల పరమేశ్వర్ ఆధ్వర్యంలో ఉప్పల్లో భారీ ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ధర్నా చేపట్టారు. ఎలివేటెడ్ కారిడార్ పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని టీపీసీసీ ప్రతినిధులు మేకల శివారెడ్డి, ఉప్పల్  నియోజకవర్గం ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మందుముల పరమేశ్వర్ రెడ్డి, టీపీసీసీ సెక్రెటరీ పసుల ప్రభాకర్ రెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ రజిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారిడార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయని దుయ్యబట్టారు.
దొంగనే దొంగ దొంగ అన్నట్టుగా కారిడార్ పేరుతో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు దొంగ నాటకాలు ఆడుతున్నారని ధ్వజ మెత్తారు.నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో జరిగిన ప్రమాదాలతో సుమారు 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారన్నారు.
రెండు ఏళ్ళల్లో కారిడార్ పనులను పూర్తి చేయాల్సి ఉండగా ఐదేళ్ళు అయినప్పటికీ పది శాతం పనులు కూడా పూర్తి కాలేదన్నారు. 
బీజేపీ,బీఆర్ఎస్ ప్రభుత్వాలు పనుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. కానీ ప్రచారం మాత్రం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.ఉప్పల్లో ఆస్తులు కోల్పోయిన యజమానులకు అరకొర పరిహారం ఇచ్చి అభివృద్ధి పేరుతో మోసం చేశారని దుయ్యబట్టారు.
ఈ సందర్భంగా ఉప్పల్ మెయిన్ రోడ్డులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ  ప్రతినిధులు ఎం.డి తౌఫిక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్ కృష్ణ రెడ్డి, బోరంపేట కృష్ణ ముదిరాజ్  ,తుంగతుర్తి రవి చారి, చెన్ రెడ్డి రఘపతి రెడ్డి ,తవిడబోయిన గిరిబాబు, తెల్కల మోహన్ రెడ్డి ,సుర్వి మురళి గౌడ్, బికుమల అంజయ్య గుప్తా ,  మక్తాల శేఖర్ గౌడ్ ,మురళి ముదిరాజ్ ,ఎం.డి షఫీ ,ఆకిటి ఆగం రెడ్డి, ఈగ అంజయ్య ,డివిజన్ అధ్యక్షులు బాకారం లక్ష్మణ్  ,కొంపల్లి బలరాజ్ ,వసునూరి ప్రకాష్ రెడ్డి, కాలేరు జై నవీన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.