ఎన్ సి డి కిట్స్ పంపిణీ చేసిన మండల వైద్యాధికారి

Published: Saturday November 19, 2022

జన్నారం, నవంబర్ 18, ప్రజాపాలన:  మంచిర్యాల జిల్లా జన్నారం మండలం 9 గుడిసెల పల్లె గ్రామపంచాయతీ పరిధిలో బీపీ షుగర్ పేషెంట్లకు శుక్రవారం మండల వైద్యాధికారి డాక్టర్ ప్రసాద్ రావు చేతుల మీదుగా ఎన్ సి డి కిట్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీపీ, షుగర్, డయాబెటిక్ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా వైద్యులు రోగులను పరీక్షలు నిర్వహించి మందులు ఎలా వాడాలో జాగ్రత్త పరుచుకోవాలో పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జె దివేన పిఏచ్సి, కల్పన అచ్ఏ, ఆశ వర్కర్లు, ప్రభుత్వ వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.