హనుమాన్ దుర్గాదేవి సన్నిధిలో కుంకుమ పూజ అన్నదానం

Published: Wednesday October 13, 2021
కొడిమ్యాల, అక్టోబర్ 12 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల లోని హనుమాన్ దేవాలయంలో దుర్గామాత సన్నిధిలో మంగళవారం రోజున దుర్గాదేవికి భాస్కర్ పంతులు కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు., అనంతరం వెయ్యి మందికి కి రామగిరి నారాయణ శోభ, రామగిరి లక్ష్మన్ పల్లవి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.