shankarapatnam 14octobar ప్రజాపాలన: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రం
గా అక్రమ పేలుడు పదార్థాల వ్యాపారం యేదేచ్ఛగా కొనసాగుతోంది. ఈ మండల కేంద్రం ఉత్తర తెలంగాణ అక్రమ వ్యాపారులకు కేంద్రబిందువుగా ఉంది.ఈ మండల కేంద్రం లోని పోలీస్ స్టేషన్ లో ఇదివరకే కొందరు వ్యాపారులపై ఈ అక్రమ పేలుడు పదార్థాల కేసులు ఉండటం విదితమే. ఈ యొక్క మండల కేంద్రం కరీంనగర్ వరంగల్ రాహదారి ని ఆనుకొని ఉండటము ఈ అక్రమార్కులకు కలిసొచ్చే అంశము. గతం లో ఇక్కడనుంచి కొన్ని సంఘవిద్రోహక శక్తులకు ఈ పేలుడు పదార్థాలను చేరవేసినట్టు పోలీసులు లు అనుమానిస్తున్నారు ఇక్కడనుంచే హుస్నాబాద్ హుజూరాబాద్ సుల్తానాబాద్ ప్రాంతాలకు ఈయొక్క పేలుడు పదార్థాల ను ఇక్కడనుంచి రావణచేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ మండల కేంద్రంలో నే ఈ యొక్క పేలుడు పదార్థాలు డంప్ చేసుకొని ఇక్కడనుంచి సప్లయి చేస్తున్నారనీ వినికిడి. ఇప్పటికైనా జిల్లా పోలీసులు ఉన్నతాధికారులు స్పందించి తాగు చర్యలు తీసుకోవాల్సిందిగా వివిధ గ్రామల ప్రజలు కోరుతున్నారు
Share this on your social network: