రాపా చర్చికి 20 కుర్చీల విరాళం. ...మత సామరస్యం చాటుకున్న హిందూ దంపతులు. మంచిర్యాల టౌన్, డిసెంబర్

Published: Monday December 19, 2022

మంచిర్యాల జిల్లా, హాజీపూర్ మండలం, ముల్కల గ్రామానికి చెందిన కోత్త పెళ్లి శ్రీరామ్ మూర్తి - సంధ్య అనే హిందూ దంపతులు తమకు ( సాయి మోక్షజ్ఞ రాజు) కుమారుడు పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆ గ్రామానికి చెందిన రాపా చర్చికి ఆదివారం 20 కుర్చీలు విరాళం అందజేసి మత సామరస్యాన్ని చాటుకున్నారు. దంపతుల నుంచి విరాళం స్వీకరించిన  చర్చి పాస్టర్ సామెల్ మాట్లాడుతూ తోటి వారిపై ప్రేమ, దయ, సహాయ గుణం కలిగి ఉండటమే దైవత్వం అని అన్నారు.ఈ సందర్భంగా శ్రీరామ్ మూర్తి - సంధ్యా దంపతులను స్థానిక క్రైస్తవ సోదరులు అభినందించారు.