కరోనా జాగ్రత్తలు అందరూ పాటించాలి. ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి

Published: Wednesday December 01, 2021
మధిర నవంబర్ 30 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం దెందుకూరు గ్రామం పిహెచ్సి దెందుకూరు పరిధిలో పిహెచ్సి వైద్య అధికారులు డా.వెంకటేష్ డా శశిధర్ ఆధ్వర్యంలో హెచ్స్ లంకా కొండయ్య పారా మెడికల్ బృందంచే ఇంటింటికి తిరుగుతూ కోవిడ్ వాక్సిన్ సర్వే చేస్తూ వాక్సిన్ వేస్తూ మాస్క్ లు ఎంపీడీఓ చేతుల మీదుగా పంపిణి చేసినారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో ఓమిక్రాన్ అనే కరోనా వైరస్ ప్రభావం రానున్న రోజు ల్లో ఉండవచ్చు అని శాస్త్ర సాంకేతిక నిపుణులు తెలియజేస్తున్నారు కావున ఏది ఏమైనా  కరొనా పట్ల  ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించండి అని తెలియజేస్తూ, కరోనా వాక్సిన్ 18+ దాటిన వారు సీనియర్ సిటిజన్లు అందరూ చెయంచు కోవాలని  ప్రజలను చైతన్యపరిచినారు. అదే విధంగా తొర్లపాడు ప్రాధమిక పాఠశాల నందు విద్యార్థులకు ఆరోగ్యసూత్రాలు బోధించారు మరియు గర్భిణీ స్త్రీ లును కలసి ప్రభుత్వ హాస్పిటల్ కాన్పు గురించి చైతన్య పరచినారు. ఈ కార్యక్రమంలో హెచ్స్ లంకా కొండయ్యతో పాటు ఎఎన్ఎం భారతి స్కూల్ ఉపాధ్యాయ యులు రాయభారపు రమేష్ బాబు, చందన మేడం జిపి సెక్రటరీ  ఆర్ విజయలక్ష్మి ఆశ వేల్పుల విజయమ్మ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.