ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు

Published: Tuesday September 07, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 6 (ప్రజాపాలన ప్రతినిధి) : రామంతాపూర్ డివిజన్లో ఎన్నికల ముందు గత కొన్ని సంవత్సరాలుగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడిన రామ్ శంకర్ నగర్ రక్త మైసమ్మ దేవాలయం ఎదురుగా ఉన్న కాలనీలో స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు వారికి ఇచ్చిన వాగ్దానంతో జలమండలి అధికారులతో మాట్లాడి కొత్త పైపులైన్ వేయించడం జరిగింది. ఈ మేరకు కార్పొరేటర్  బండారు శ్రీవాణి వెంకట రావు ముఖ్య అతిథులుగా విచ్చేసి మంచినీటి పైపులైన్లు ప్రారంభించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అందుకు కాలనీవాసులు కార్పొరేటర్ కు కృతజ్ఞతలు తెలిపి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలనీవాసులు, సాయినాథ్, గోవర్ధన్, సంపత్ చారి, వెంకటేష్, బాబు, కృష్ణ, వారితో పాటు బిజెపి నాయకులు రామంతపూర్ డివిజన్ అధ్యక్షుడు బండారు వెంకట్రావు, బీరప్ప, రేవు నరసింహ, పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి, ఆనందరావు, పాల్గొన్నారు