45వ డివిజన్ లో సమావేశం

Published: Thursday June 24, 2021
బాలపూర్, జూన్ 23, ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాముల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పురపాలక చట్టం 2019 లోని సెక్షన్ 17, 30 & 31 ననుసరించి నగరపాలక సంస్థ మీర్ పేట్ కార్పొరేషన్ లోని అన్ని వార్డుల యందు కమిటీల సమావేశం నిర్వహించి తదనుగుణముగా ప్రణాళిక రూపొందించి వలసిన సందర్భంలో 45వ వార్డు కమిటీ కార్పొరేటర్ అక్కి మాధవి ఈశ్వర్ గౌడ్ అధ్వర్యంలో డివిజన్ ప్రజలు కాలనీ వాసులతో కలిసి వార్డ్ ఆఫీసర్ తో సమావేశం నిర్వహించారు. వార్డు ప్రజలతో చర్చించి చేసిన అంశములను కార్యాలయమునకు పంపించారు. ఎజెండా అంశములు: (1) పారిశుధ్యం సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంటు (2) హరితహారం (3) తాగునీరు సరఫరా (4) పార్కులు, ఆట స్థలము, పబ్లిక్ టాయిలెట్లు నిర్వహణ (4) అస్తి పన్ను ఇతర పన్నుల వసూలు (5) అక్రమ నిర్మాణాలు/ నిబంధనలకు విరుద్ధమైనవి (6) కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యంగా ఆటలు మొదలైన వాటికి ప్రోత్సహించారు. ఈ అంశములపై చర్చించుటకు ప్రజలు  హాజరైనారు. ఈ డివిజన్ లో కాలనీ వాసులు, డైనమిక్స్ కాలనీ, కేశవ రెడ్డి కాలనీ, రాఘవేంద్ర నగర్ కాలనీ, అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కాలనీ వాసులతో చర్చించిన అంశములను రికార్డు చేసిన అంశంల కార్పొరేటర్ సంతకంతో కార్యాలయమునకు పంపించడం జరిగిందిని అదేవిధంగా కాలనీవాసులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు స్థానిక కార్పొరేటర్ తెలియజేశారు.