విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి : ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Published: Tuesday February 15, 2022
బెల్లంపల్లి ఫిబ్రవరి 14 ప్రజాపాలన ప్రతినిధి: విద్యార్థినీలందరూ బాగా చదువుకుని జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సూచించారు. సోమవారం నాడు బెల్లంపల్లి నియోజకవర్గం కాసి పేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వసతులపై ఆరా తీశారు. అనంతరంఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కస్తూర్బా గాంధీ విద్యాలయంలో చదువుతున్న విద్యార్టినీలందరు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీ, వైస్ ఎంపీపీ విక్రమ్, జడ్పీటీసీ చంద్రయ్య, మండల తెరాస పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, మండల ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: