లడకబజార్ లోని శ్రీ బాల గణేష్ ఆధ్వర్యంలో షటిల్ పోటీలు మధి

Published: Monday January 02, 2023
 మధిర జనవరి 1 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు లడక్ బజార్ బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో షటిల్ పోటీలు 25 న డిసెంబర్ నెలలో  షటిల్ టోర్న్ మెంట్ నిర్వహించడం జరిగింది. దీనిలొ పాల్గొన్న వారికి  ప్రధమ,ద్వితీయ మరియు కన్సోలేషన్ బహుమతులు ప్రదానం చేయటం జరిగింది మరియు ఈ పోటీ లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ  ప్రైజ్ లు  ఇవ్వడం జరిగింది .ఈ కార్య క్రమం డిసెంబర్ 31 జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కూరపాటి శ్రీనివాస రావు ,ఉపాధ్యాయులు శీలం శ్రీనివాస రెడ్డి  ఉపాధ్యాయులు కొండల రావు మరియు నాగేశ్వర రావు  విచ్చేశారు.వీరి చేతులమీదుగా క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమం కాంతాల రవి  పర్యవేక్షణ లో నిర్యహించడం జరిగింది.