టెట్ పరీక్ష ఫలితాలలో సత్తా చాటిన ఎం కె ఆర్ ఫౌండేషన్ అభ్యర్థులు

Published: Tuesday July 05, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 4ప్రజాపాలన ప్రతినిధి. మంచిరెడ్డి కిషన్ రెడ్డి(ఎంకేఆర్) ఫౌండేషన్ ఆధ్వర్యంలో (TET) టెట్ శిక్షణ పొందిన 196మంది అభ్యర్థులలో అర్హత సాధించిన 159మంది అభ్యర్థులు ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి ని తన క్యాంపు కార్యాలయంలో కలిసి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఎమ్మెల్యే  వారికి అభినందనలు తెలియజేస్తూ ఇదే సంకల్పంతో తుదిదశ వరకు కష్టపడి విజయతిరాలకు చేరువ అవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఫౌండేషన్ కార్యదర్శి జెర్కొని రాజు, అకాడమిక్ ఇంచార్జ్ వెంకట్ కండ్లకొలు, గందే నరేష్, ఫౌండేషన్ సభ్యులు నిట్టు జగదీష్, విజయ్ రజక్, పాతూరి రాజేష్, కొంకని విజయ్, మొగుళ్ల వినయ్ రెడ్డి, జీవన్ రెడ్డి, చీర వంశీ తదితరులు పాల్గొన్నారు.