అనాధ శావానికి అంత్యక్రియలు నిర్వహించిన గ్రామ సర్పంచ్

Published: Monday May 17, 2021
కోరుట్ల, మే 16, (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల మండలం లోని మాదాపూర్ గ్రామం లో కడు పేదరికం తో అనాథల జీవిస్తున్న పల్లి నారాయణ అనారోగ్యం తో మరణించడం జరిగింది. గ్రామ సర్పంచ్ దారిషేట్టి రాజేష్ ముందుండి అంత్యక్రియలు నిమిత్తము అయిన ఖర్చును బరించి, పేదరికంతో ఉన్న వారిని ఆదరించి అంత్యక్రియలను వారి సంప్రదాయం ప్రకారం జరుపడానికి  ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ దారిషెట్టి రాజేష్ మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గ్రామానికి సంబంధించి ఎలాంటి సహాయ సహకారాలు అయిన అందించడానికి గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని, అంతక్రీయల్లో పాల్గొన్న వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో  గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్తలు పోడెండ్ల నాగ మల్లేష్, శివరాత్రి రవి, బత్తిని భక్త గౌడ్, మహేష్, రమేష్ లక్ష్మణ్ లు అంత్యక్రియల్లో  పాల్గొన్నారు.