ఆరుముళ్ల రాజును అభినందించిన డిసిపి.

Published: Friday November 25, 2022
మంచిర్యాల బ్యూరో, నవంబర్ 24, ప్రజాపాలన:
 
 
జాతీయ సేవరత్న అవార్డ్ గ్రహీత అరుముళ్ల రాజు ను మంచిర్యాల డిసిపి  అఖిల్  మహాజన్   శాలువ కప్పి అభినందించారు.   ఈ నెల 13, 14 వ న ఢిల్లీ లో జరిగిన సమావేశం లో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు  నల్ల రాధాకృష్ణ చేతుల మీదగా  అరుముళ్ల రాజు జాతీయ సేవరత్న అవార్డ్ తీసుకున్నారు. ఈ క్రమంలో గురువారం జిల్లా కేంద్రంలో డిసిపి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించిన డిసిపి స్వచ్ఛంద సంస్థలు సేవాభావంతో పనిచేయాలని అన్నారు. అరుముళ్ల రాజు అద్వర్యంలో బ్లడ్ డొనేషన్, ఆర్గాన్ డొనేషన్ , పేద విద్యార్థులను ప్రోత్సాహం చేసి వివిధ స్కాలర్షిప్ ల ద్వారా వాళ్ళను చదివించడం అభినందనీయమని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అరుముళ్ల రాజు మాట్లాడుతూ నన్ను గుర్తించి అభినందించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో  రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ అబ్దుల్ రహీమ్,   జేసిఐ సభ్యులు వెంకటేష్,  తిరుపతి మరియు తదితరులు   పాల్గొన్నారు.